Site icon NTV Telugu

హనుమంతుడి జన్మస్థలంలో ఇక పై టీటీడీ నిత్య పూజలు…

నిన్న తిరుమల శ్రీవారిని 11302 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 3710 మంది భక్తులు సమర్పించగా… హుండి ఆదాయం 87 లక్షలు ఉంది. ఇక హనుమంతుడి జన్మస్థలం అయిన ఆకాశగంగలో ఇక పై నిత్య పూజలు, నివేదన సమర్పించేలా ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. అయితే ఈ నెల 19వ తేదిన టిటిడి పాలకమండలి సమావేశం జరగనుండగా… 21వ తేదిన పాలకమండలి గడువు ముగియనుంది. ఇక శ్రీవారి మెట్టు నడకమార్గంలో ఆలయం వద్ద శంఖు, చక్రాలు విగ్రహల తొలగించిన టీటీడీ… శ్రీవారి నామాల విగ్రహాన్ని మాత్రం ఉంచింది. జంతువుల కారణంగా శంఖు, చక్రాల విగ్రహాలు దెబ్బతిన్నాయంటున్నారు టీటీడీ అధికారులు. కానీ తొలగించిన విగ్రహాలు ఏర్పాటు చెయ్యకపోవడం పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు.

Exit mobile version