TTD: శ్రీవాణి దర్శన టిక్కెట్ల జారీ విధానంలో కీలక సంస్కరణలు..
- శ్రీవాణి దర్శన టిక్కెట్ల జారీ విధానంలో మార్పులు చేసిన టీటీడీ..
- తిరుమలలో ఆఫ్లైన్ ప్రకియలో జారీచేసే శ్రీవాణి దర్శన టిక్కెట్ల విధానం రద్దు..
- ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే 800 టికెట్లు ఇక పై ఆన్ లైన్ విధానంలో జారీ..
- ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ విధానంలో టిక్కెట్లు విడుదల..
- సాయంత్రం 4 గంటలకు దర్శనానికి అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు ఎక్కువగా వినియోగించే శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. తిరుమలలో ఆఫ్లైన్ ప్రక్రియ ద్వారా రోజూ జారీ చేస్తున్న 800 టికెట్ల విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు TTD ప్రకటించింది. ఇప్పటివరకు ప్రతిరోజూ తిరుమలలో ఆఫ్లైన్ ద్వారా విడుదలయ్యే 800 శ్రీవాణి దర్శన టికెట్లు ఇకపై ఆన్లైన్ విధానంలోనే విడుదల చేయనున్నారు. భక్తులు ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు TTD అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. టికెట్ పొందిన భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రేణిగుంట విమానాశ్రయంలో ఆఫ్లైన్ ద్వారా జారీ చేసే శ్రీవాణి దర్శన టికెట్ల విధానాన్ని మాత్రం కొనసాగించనున్నట్లు TTD స్పష్టం చేసింది. అక్కడ టికెట్ల జారీ, భద్రతా పరిశీలన, దర్శన సమయాల కేటాయింపు గత మాదిరిగానే కొనసాగుతాయి. అదే సమయంలో, భక్తులు ముందస్తుగా దర్శనం ప్లాన్ చేసుకునేలా TTD అమలు చేస్తున్న మూడు నెలలు ముందుగా ఆన్లైన్లో విడుదల చేసే 500 టికెట్ల శ్రీవాణి కోటా విధానం కూడా యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.
Also Read
- Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
- Trisha Visits Tirumala: తమిళనాడు ఫలితాల ముందు తిరుమలలో హీరోయిన్ త్రిషా దర్శనం.. టీవీకే విజయానికి ప్రార్థనలు..?
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
TTD తాజా నిర్ణయాలు..
* తిరుమలలో రోజూ ఆఫ్లైన్లో జారీ చేసే 800 టికెట్ల విధానం రద్దు
* ఆ 800 టికెట్లు ఇకపై ప్రతిరోజూ ఉదయం 9కి ఆన్లైన్లో విడుదల
* టికెట్ పొందిన భక్తులకు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి అనుమతి
* రేణిగుంట విమానాశ్రయంలో ఆఫ్లైన్ టికెట్లు కొనసాగింపు..
* 3 నెలల ముందుగా జారీ చేసే 500 టికెట్ల ఆన్లైన్ కోటా కొనసాగింపు
ఈ మార్పులు దర్శన టికెట్ల నిర్వహణను మరింత పారదర్శకంగా, క్రమబద్ధంగా మార్చడానికేనని TTD అధికారులు తెలిపారు. రద్దీ నియంత్రణ, డిజిటల్ టికెట్ దుర్వినియోగం అరికట్టడం, భక్తులకు సమయానుగుణ దర్శన సౌకర్యం కల్పించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ కొత్త విధానం అమలులోకి రావడంతో, ఇకపై తిరుమలలో ఆఫ్లైన్ టికెట్ల కోసం క్యూలలో వేచిచూడాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న భక్తులు నిర్ణీత సమయానికి దర్శనం చేసుకునేలా TTD ప్రణాళిక రూపొందించింది. TTD తాజా సంస్కరణలతో తిరుమల దర్శన నిర్వహణలో మరో కీలక అధ్యాయం మొదలైందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!