TTD: శ్రీవాణి దర్శన టిక్కెట్ల జారీ విధానంలో కీలక సంస్కరణలు..
- శ్రీవాణి దర్శన టిక్కెట్ల జారీ విధానంలో మార్పులు చేసిన టీటీడీ..
- తిరుమలలో ఆఫ్లైన్ ప్రకియలో జారీచేసే శ్రీవాణి దర్శన టిక్కెట్ల విధానం రద్దు..
- ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే 800 టికెట్లు ఇక పై ఆన్ లైన్ విధానంలో జారీ..
- ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ విధానంలో టిక్కెట్లు విడుదల..
- సాయంత్రం 4 గంటలకు దర్శనానికి అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు ఎక్కువగా వినియోగించే శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. తిరుమలలో ఆఫ్లైన్ ప్రక్రియ ద్వారా రోజూ జారీ చేస్తున్న 800 టికెట్ల విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు TTD ప్రకటించింది. ఇప్పటివరకు ప్రతిరోజూ తిరుమలలో ఆఫ్లైన్ ద్వారా విడుదలయ్యే 800 శ్రీవాణి దర్శన టికెట్లు ఇకపై ఆన్లైన్ విధానంలోనే విడుదల చేయనున్నారు. భక్తులు ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు TTD అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. టికెట్ పొందిన భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రేణిగుంట విమానాశ్రయంలో ఆఫ్లైన్ ద్వారా జారీ చేసే శ్రీవాణి దర్శన టికెట్ల విధానాన్ని మాత్రం కొనసాగించనున్నట్లు TTD స్పష్టం చేసింది. అక్కడ టికెట్ల జారీ, భద్రతా పరిశీలన, దర్శన సమయాల కేటాయింపు గత మాదిరిగానే కొనసాగుతాయి. అదే సమయంలో, భక్తులు ముందస్తుగా దర్శనం ప్లాన్ చేసుకునేలా TTD అమలు చేస్తున్న మూడు నెలలు ముందుగా ఆన్లైన్లో విడుదల చేసే 500 టికెట్ల శ్రీవాణి కోటా విధానం కూడా యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.
Also Read
TTD తాజా నిర్ణయాలు..
* తిరుమలలో రోజూ ఆఫ్లైన్లో జారీ చేసే 800 టికెట్ల విధానం రద్దు
* ఆ 800 టికెట్లు ఇకపై ప్రతిరోజూ ఉదయం 9కి ఆన్లైన్లో విడుదల
* టికెట్ పొందిన భక్తులకు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి అనుమతి
* రేణిగుంట విమానాశ్రయంలో ఆఫ్లైన్ టికెట్లు కొనసాగింపు..
* 3 నెలల ముందుగా జారీ చేసే 500 టికెట్ల ఆన్లైన్ కోటా కొనసాగింపు
ఈ మార్పులు దర్శన టికెట్ల నిర్వహణను మరింత పారదర్శకంగా, క్రమబద్ధంగా మార్చడానికేనని TTD అధికారులు తెలిపారు. రద్దీ నియంత్రణ, డిజిటల్ టికెట్ దుర్వినియోగం అరికట్టడం, భక్తులకు సమయానుగుణ దర్శన సౌకర్యం కల్పించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ కొత్త విధానం అమలులోకి రావడంతో, ఇకపై తిరుమలలో ఆఫ్లైన్ టికెట్ల కోసం క్యూలలో వేచిచూడాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న భక్తులు నిర్ణీత సమయానికి దర్శనం చేసుకునేలా TTD ప్రణాళిక రూపొందించింది. TTD తాజా సంస్కరణలతో తిరుమల దర్శన నిర్వహణలో మరో కీలక అధ్యాయం మొదలైందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Volkswagen Tukan Pickup: వోక్స్వ్యాగన్ టుకాన్ పికప్ ఆవిష్కరణ.. రగ్డ్ డిజైన్, 1.5 TSI హైబ్రిడ్ ఇంజిన్
-
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
-
Gajakesari Yoga 2026 : గజకేసరి యోగం.. ఈ రాశులకు గురు, చంద్రుల కలయికతో లక్ష్మీకటాక్షం.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?