NTV Telugu Site icon

Guntur: గుంటూరులో వీధి కుక్కల స్వైర విహారం.. బాలుడిపై దాడి..

Untitled 1

Untitled 1

ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు ఎక్కవయ్యాయి. వీధుల్లో స్వైర విహారం చేస్తూ ప్రజలను భయాభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆ మధ్య హైదరాబాద్ నగరంలో ఓ బాలుడిపై దాడికి చేయడంతో చిన్నారి మ`తి చెందిన ఘటన కలకలం రేపింది. తాజాగా ఏపీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే అద`ష్టవశాత్తు బాలుడికి ప్రాణాపాయం తప్పింది. వివరాలు.. గుంటూరు జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. పట్టణంలోని సంపత్‌నగర్‌లో ఓ బాలుడిపై మూకుమ్ముడిగా వీధి కుక్కలు దాడి చేశాయి. వాటిని నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలుడు భయంతో అరుస్తూ పరుగుల తీశాడు.

అదే సమయంలో అటుగా వస్తున్న వాహనదారులు బాలుడిని రక్షించారు. కుక్కలను అడ్డుకుని భయపెట్టి తరమడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ ఘటనలో బాలుడు గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల ఘటనలు ఎక్కువయ్యాయని, ఫిర్యాదు చేసిన అధికారులు తప్పించుకోవడం లేదని వాపోయారు. వీధి కుక్కలను కట్టడి చేయడంలో కార్పొరేషన్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, ఇప్పటికైన స్పందించి సహాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.