Site icon NTV Telugu

సంగం డెయిరీ మార్కెటింగ్ మేనేజర్ కు పోలీసుల నోటీసులు…

గుంటూరు సంగం డెయిరీ మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విజయవాడలో సంగం డెయిరీ పాలక మండలి సమావేశం నిర్వహించడంపై కేసు నమోదు చేసారు పోలీసులు. కేసు దర్యాప్తులో భాగంగా శ్రీధర్ ఇంటికి వెళ్లారు పటమట పోలీసులు. అయితే ఆ సమయంలో ఇంట్లో శ్రీధర్ లేకపోవడంతో 160 సిఆర్ పిసి కింద నోటీసు ఇచ్చారు పోలీసులు. నేడు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ కరోనా సమయంలో సమావేశం నిర్వహించడం కోవిడ్ నిబంధనలను ఉల్లగించడంతో ఈ కేసు నమోదు చేసారు.

Exit mobile version