NTV Telugu Site icon

హైవే కిల్ల‌ర్ మున్నా కేసులో ఒంగోలు కోర్టు కీల‌క తీర్పు…12 మందికి ఉరిశిక్ష‌…

2008 లో సంచ‌ల‌నం సృష్టించిన హైవే కిల్ల‌ర్ మున్నా గ్యాంగ్ కేసులో ఒంగోలు కోర్టు కీల‌క తీర్పును వెల‌వ‌రించింది.  ఈ కేసులో 12 మందికి కోర్టు ఉరిశిక్ష విధిస్తు తీర్పు ఇచ్చింది. హైవేల‌పై కాపుకాచి, ఇనుముతో వ‌చ్చే లోడు లారీల‌ను, మార్గమధ్యంలో అటకాయించి మున్నా, అతని గ్యాంగ్  ఇనుము లోడును దోచుకునేవారు.  ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిల్లర్ మున్నాను అదుపులోకి తీసుకున్నారు.  ఈ కేసులో సంబంధం ఉన్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అనేక సంవత్సరాలు ఈ కేసును విచారించిన ఒంగోలు కోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించింది.  కిల్లర్ మున్నా గ్యాంగ్ 12 మందికి ఉరిశిక్ష విధిస్తు తీర్పు ఇచ్చింది.