Nara Lokesh: గన్ కంటే ముందొస్తానని ప్రచారం చేసుకున్న జగన్ ఎక్కడ?

Nara Lokesh

Nara Lokesh

ఏపీలో కడప జిల్లాలో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఏపీలో మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ‌న్ కంటే ముందొస్తానని కోట్ల రూపాయ‌ల ప్రక‌ట‌న‌ల ద్వారా జగన్ ప్రచారం చేయించుకున్నారని.. సొంత క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో అన్నెంపున్నెం ఎరుగ‌ని ద‌ళిత‌ బాలిక‌పై సామూహిక అత్యాచారం జ‌రిగితే గన్ ఎక్కడా? జగన్ ఎక్కడా? అని లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

Crime News: ఏపీలో మరో దారుణం.. బాలికపై 10 మంది గ్యాంగ్ రేప్

అమాయ‌క బాలిక‌పై లైంగిక దాడిని మ‌హిళా పోలీసులు వెలుగులోకి తెస్తే పోలీసులు నిందితుల్ని ప‌ట్టుకోకుండా కేసు మాఫీ చేయాల‌ని ఎందుకు ప్రయ‌త్నిస్తున్నారని నారా లోకేష్ నిలదీశారు. ప‌దిహేనేళ్లు కూడా నిండ‌ని బాలిక‌ను గ‌ర్భవ‌తిని చేసిన నిందితుల‌ను కాపాడ‌ట‌మేనా మీరు ఆడ‌బిడ్డల‌కి క‌ల్పించే ర‌క్షణ అంటూ లోకేష్ మండిపడ్డారు.