ఏపీలో ఎన్నికల వాతావరణం మళ్ళీ వేడెక్కింది. గతంలో ఎన్నికలు జరగని మునిసిపాలిటీల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో మునిసిపల్ ఎన్నికలకు నగారా మోగింది. తొలిసారి బేతంచర్లకు మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ప్రారంభమయింది. రెండో రోజునామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.
వివిధ పార్టీల నేతలు భారీ బందోబస్తు మధ్య నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. టీడీపీ ఛైర్మెన్ అభ్యర్థిగా బి. ప్రసన్న లక్ష్మీ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలకు తరలి వచ్చారు టీడీపీ సీనియర్ నాయకులు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, కెఈ ప్రతాప్. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇరు పార్టీలు తమ వ్యూహాలను అమలుచేస్తున్నారు.
ఇదిలా వుంటే.. చైర్మన్ సీటు కైవసం చేసుకోవాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. తొలిసారి టీడీపీ జెండా ఎగుర వేసేందుకు నాయకుల వ్యూహాలు వేస్తున్నారు. వైసీపీ మాత్రం ఏ ఎన్నికలు జరిగినా ఎగిరేది వైసీపీ జెండాయే అనే ధీమాతో వున్నారు.