Site icon NTV Telugu

RK Roja: బాబు పాలనలో రైతుల కష్టానికి విలువలేదు

Roja1

Roja1

రైతుల గురించి అనునిత్యం ఆలోచిస్తున్నారని అన్నారు మంత్రి రోజా. రాష్ట్రంలో ఎక్కడా పడితే అక్కడ సిగ్గు లేకుండా చంద్రబాబు బాదుడే బాదుడు అంటున్నారు. 14 ఏళ్ళు అధికారంలో 13 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు రైతుల గురించి ఏ రోజైనా ఆలోచించారా? రైతు భరోసా లాంటి గొప్ప పథకం గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు రోజా.

చంద్రబాబు అధికారంలో ఉండగా 92 శాతం రైతులను అప్పుల ఊబిలో ముంచారు. వ్యవసాయం దండగ అని పుస్తకం రాసింది చంద్రబాబు కాదా..? చంద్రబాబు పాలనలో రైతులు కష్టానికి విలువ లేదు..‌రైతుల చెమటకి ఖరీదు లేదు.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఎంతో మంది వేదికలపైకి స్టేట్మెంట్ ఇచ్చిన నాయకులను చూశాం. కానీ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం కమిట్మెంట్ తో రైతులకు ఆదుకోవాలని ముందుకు వచ్చి ఆదిశగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు రోజా.

తిరుపతిలో రైతు భరోసా చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు రెడ్డప్ప, గురుమూర్తి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, వెంకట గౌడ్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు.

Kakani GovardhanReddy: రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవస్థలో మార్పు

Exit mobile version