Site icon NTV Telugu

చంద్రబాబు ఇప్పటికైనా భ్రమల్లోంచి బయటకు రావాలి….

ప్రజల హృదయాల నుంచి ఉద్యమాలు పుడతాయి. కొంతమంది ప్రయోజనాల కోసం చేసే వాటిని డ్రామాలంటారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా చంద్రబాబు లాంటి సీనియర్ నేతలు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోంది అని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. 600 రోజులు అయ్యాయని ఒక పండుగ వాతావరణం టీడీపీలో కలిగిస్తోంది. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకోవాలి. లోకేష్ మంగళగిరిలో ఓడిన తర్వాత అయినా వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని గ్రహిస్తారు అనుకున్నాం. చంద్రబాబు ఇప్పటికైనా భ్రమల్లోంచి బయటకు రావాలి అని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వచ్చిన ఫలితాలు ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తున్నారన్నది స్పష్టం అయ్యింది కదా రాజధాని ప్రాంతం గ్రామాల్లోను పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు దారులే గెలిచారు కదా అని గుర్తు చేసారు.

Exit mobile version