సీఎస్ ఆదిత్య నాథ్ దాస్ కు కీలక పదవి

న్యూ ఢిల్లీ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్య నాథ్‌ దాస్‌ ను నియమిస్తూ… ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్య నాథ్‌ దాస్‌ సెప్టెంబర్‌ 30 న పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని.. ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేబినెట్‌ మంత్రి హోదాలో న్యూఢిల్లీ లోని ఏపీ భవన్‌ కేంద్రంగా ఆదిత్య నాథ్‌ దాస్‌ పని చేయనున్నారని… జీఏడీ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాల రాజు ఉత్తర్వుల్లో వెల్లడించారు.