Site icon NTV Telugu

Summer Effect: వడదెబ్బ తగలకుండా వుండాలంటే..

ఎండాకాలం వచ్చేసింది. భానుడు ప్రచండంగా మారిపోతున్నాడు. సూరీడు దెబ్బకు జనం విలవిలలాడిపోతున్నారు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండే సమయంలో ఎక్కువగా ఎండలో తిరగవద్దు. రోడ్ల వెంట విక్రయించే చల్లని రంగు పానీయాలు, కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలి. మద్యం, మాంసం తగ్గించాలి. నీరు, పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. కోవిడ్ టైంలో ఎలాగైతే జాగ్రత్తలు పాటించామో ఇప్పుడు కూడా అదేవిధంగా జాగ్రత్తగా వుండాలి.

ఒకవేళ ఎవరికైనా వడదెబ్బ తగిలితే వెంటనే త్వరగా చల్లని గాలి తగిలే ప్రదేశానికి చేర్చాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు ద్రావణం లేదా ఓఆర్‌ఎస్‌ తాగించాలి. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఎండాకాలం మరింత జాగ్రత్తగా వుండాలి. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తికి బీపీ హెచ్చుతగ్గుల వల్ల కార్డియాక్‌ అరెస్ట్‌ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వెంటనే ఆసుపత్రికి తరలించాలి.

https://ntvtelugu.com/summer-effect-in-telangana-health-department-high-alert/

వడదెబ్బ లక్షణాలు ఎలా వుంటాయో ముందుగా తెలుసుకోవాలి. సాధారణంగా వడదెబ్బకు గురైనప్పుడు సాధారణంగా 102డిగ్రీల ఫారెన్ హీట్ కంటే తక్కువ జ్వరం వస్తుంది. దీంతో పాటు వాపు, మూర్ఛ వచ్చే ప్రమాదముంది. అలసట, బలహీనత, వికారం, తలనొప్పి, వాంతులు, కండరాల్లో తిమ్మిరి సహా ఒళ్లంతా చెమటలు పడుతుంటాయి.

ఏం చేయాలంటే..?

Exit mobile version