Site icon NTV Telugu

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ !

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది జగన్ సర్కార్. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పీఆర్సీ నివేదిక వచ్చే వారం విడుదల కానుంది. ఉద్యోగులు 55 శాతం పీఆర్సీ ఆశిస్తుండగా..ప్రభుత్వం మాత్రం 27 శాతం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. పీఆర్‌సీ నివేదిక వస్తే దాన్ని బట్టి ఉద్యోగులు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. తమ ఆందోళనను అర్థం చేసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

Exit mobile version