Site icon NTV Telugu

రేపు బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు

రేపు ఏపీ బంద్‌కు రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. విజయనగరంలోని లచ్చయ్యపేట షుగర్‌ ఫ్యాక్టరీ ముందు చెరకు రైతులు బకాయిలు చెల్లించాలంటూ బుధవారం నిరసనకు దిగారు. వారిని అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై రైతులు రాళ్లతో దాడి చేశారు.

ఈ ఘర్ణణలో ఆరుగురు రైతులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో గురువారం రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రేపు ఏపీ బంద్‌కు పిలునిచ్చారు. రైతులందరూ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Exit mobile version