ఎన్టీఆర్ వర్శిటీ నిధులను ప్రభుత్వానికి బదలాయించే అంశంపై ఈసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. బిడ్డింగ్ ద్వారా రావాలని ప్రభుత్వానికి, ఫైనాన్స్ సర్వీసెస్ కార్పోరేషనుకు ఈసీ సూచించింది ఇతర బ్యాంకుల కంటె ఎక్కువ వడ్డీ ఇస్తేనే వర్శిటీ నిధులు ఫైనాన్స్ సర్వీసెస్ కార్పొరేషనుకు నిధులివ్వాలని నిర్ణయం తీసుకుంది. దీని పై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ శ్యామ్ ప్రసాద్ మర్లాడుతూ… వర్శిటీలో అదనంగా ఉన్న నిధులు బదలాయించమని ప్రభుత్వం అడుగుతుంది. ఫైనాన్స్ సర్వీసెస్ కార్పొరేషన్ను కూడా ఇతర బ్యాంకులతో కలిపి బిడ్డింగులో పాల్గొనమని చెబుతాం. ఈ మేరకు దీనిపై ఈసీలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నాం. బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తే ఫైనాన్స్ సర్వీసెస్ కార్పొరేషనుకు నిధులిస్తాం. ప్రస్తుతం వర్సిటీ డిపాజిట్లకు రూ. 5.10 మేర వడ్డీ వస్తోంది. 6 బ్యాంకుల్లో వర్శిటీ నిధులు డిపాజిట్ చేశాం. రిజర్వ్ బ్యాంకు అనుమతితో ఏపీ ఫైనాన్స్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏర్పాటైంది అని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ వర్శిటీ నిధులపై ఈసీ కీలక నిర్ణయం…
