Governor Abdul Nazeer: తూర్పు గోదావరి జిల్లాలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో నేడు స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వేడుకలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వీసీ ప్రసన్నశ్రీ తెలిపారు. 2022-23, 2023-24 విద్యా సంవత్సరానికి చెందిన పీహెచ్డీ, పీజీ, పీజీ డిప్లొమా, యూజీ అండ్ పీజీ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి పట్టాలు అందించనున్నారు.. గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్డీలు, గోల్డ్ మెడల్స్ పట్టాలను ప్రదానం చేయనున్నారు..
గవర్నర్ పర్యటన షెడ్యూల్..
గవర్నర్ నేడు ఉదయం 9.40 గంటలకు విజయవాడలోని లోక్ భవన్ నుంచి బయలుదేరి, 10.00 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదయం 10.05 గంటలకు బయలుదేరి, 10.45 గంటలకు రాజమహేంద్రవరం లోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రాంగణంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. స్వల్ప విరామం అనంతరం ఉదయం 11.00 గంటలకు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ చేరుకుని, అక్కడ నిర్వహించనున్న XVI & XVII సంయుక్త స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు కొనసాగనుంది. తరువాత మధ్యాహ్నం 12.15 గంటలకు యూనివర్సిటీ నుంచి బయలుదేరి, 12.20 గంటలకు తిరిగి గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ హెలిప్యాడ్కు చేరుకుని అతిథి గృహంలో కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12.55 గంటలకు హెలికాప్టర్ ద్వారా విజయవాడకు బయలుదేరి, మధ్యాహ్నం 1.40 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరి, 2.10 గంటలకు లోక్ భవన్కు చేరుకోవడంతో గవర్నర్ పర్యటన ముగియనుంది.
