Site icon NTV Telugu

పెట్రోల్ పేరిట 14 లక్షల కోట్లు దోచుకున్నారు…

పెట్రోల్ , గ్యాస్ ధరలు అదుపులేకుండా పెరుగుతున్నాయి. కరోనా కష్టకాలంలో ప్రజలను దోపిడీ చేస్తున్నారు అని శైలజానాథ్ అన్నారు. 14 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు పెట్రోల్ పేరిట దోచుకున్నారు. దీనిపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడరు. ఒక్క స్టేట్ టాక్స్ 40 రూపాయలు ఉంది, కేంద్రం 30 రూపాయలు టాక్స్ వేస్తోంది. నేపాల్, శ్రీలంక లో తక్కువ ధరలు ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎందుకు ఎక్కువ అని ప్రశ్నించారు. మీ ఆర్థిక మిత్రులకు దోచి పెట్టడానికి ప్రజలపై భారం వేస్తున్నారు. పెట్రోల్ ధరలు పెరిగితే అన్ని ధరలు పెరిగిపోతాయ్. దీనిపై 17 తేదీ వరకూ ర్యాలీలు కొనసాగుతాయి. 17 న కర్నూలులో రాష్ట్ర స్థాయి సభ ఏర్పాటు చేస్తాం. అడిగిన మా నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. పెట్రోల్ ,గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది

Exit mobile version