NTV Telugu Site icon

Strange Customs: వింత ఆచారం..! నాలుకతో నైవేద్యం సేకరిస్తే అలా జరుగుతుందా?

Parvathipuram Manyam

Parvathipuram Manyam

Strange Customs: గ్రామీణ ప్రజలు సాధారణంగా మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతారు. దేవతలకు యాగం చేసి రకరకాల పూజలు చేస్తారు. ముఖ్యంగా వర్షం కోసం ప్రత్యేక పూజలు చేసేవారు కొందరైతే. జంతువులతో తమకు తెలిసిన నమ్మకాల ప్రకారం వివాహం చేసుకోవడం వంటి ఆచారాల గురించి మనం వింటూనే ఉంటాము. వర్షం కోసం కప్పలకు పెళ్లిళ్లు చేసుకోవడం మనం తరచుగా వింటుంటాం. వర్షాలు కురవాలని కప్పలకు పెళ్లి చేసే ఆచారం ఇప్పటికీ గ్రామాల్లో కొనసాగుతోంది. అలాగే అమ్మవారి ఆలయాల్లో వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి కోళ్లు, మేకలను బలివ్వడం చూశాం. వర్షం కోసం దేవాలయాల్లో పూజలు, హోమాలు చేయడం మనం చూస్తుంటాం. అయితే గ్రామాల్లో మాత్రం వర్షాల కోసం ప్రజలు వినూత్నంగా పూజలు చేస్తున్నారు. అయితే ఓ గ్రామంలో మాత్రం రైతులు వినూత్న రీతిలో వర్షాల కోసం పూజలు చేస్తున్నారు.

Read also: Masa Sivaratri: ఈ స్తోత్రాలు వింటే అన్ని బాధలు తక్షణమే తొలగిపోతాయి

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామానికి చెందిన రైతులు వినూత్నంగా పూజలు చేస్తున్నారు. డప్పు వాయిద్యాలతో గ్రామ సమీపంలోని నాలుగు కిలోమీటర్ల దూరంలోని కొండపై ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్తున్నారు. అక్కడ గుడి ముందు కోడి లేదా మేకను బలి ఇస్తారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న పూజ సామాగ్రితో వరదపాయసం తయారు చేసుకుంటారు. ఆ తర్వాత నైవేద్యాన్ని చాపపై ఉంచుతారు. అనంతరం రైతులు నాలుకతో వదర పాయసాన్ని తీసుకుంటారు. అయితే తరతరాలుగా గ్రామస్తులు ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. పూజలు నిర్వహించి ఒకటి, రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని రైతులు నమ్ముతున్నారు. వర్షాల కోసం ప్రతి ఏటా ఇలా చేస్తున్నామని చెబుతున్నారు. గత 20 రోజుల నుంచి గ్రామంలోని ప్రజలు తమ పొలాల్లో వరి నాట్లు వేశారు. ప్రతి సంవత్సరం ఈ నెలలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే ప్రతి సంవత్సరం ఈ మాసంలో విచిత్రమైన పూజలు జరుగుతాయి. ఈ వింత ఆచారం స్థానిక గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.
Traffic Diversions: పంద్రాగస్టు రోజున ట్రాఫిక్ ఆంక్షలు.. గోల్కొండకు వెళ్లే వారికి సూచనలు..