CM Chandrababu: తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈరోజు (జూలై 18న ) మధ్యాహ్నం 3 గంటలకు జరిగే అవకాశం ఉంది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడి నివాసంలో ఈ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీపీ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ భేటీలో టీడీపీ ఎంపీలు 16 మందితో పాటు ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా హాజరు కానున్నారు. వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో టీడీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలు, సమస్యలపై చర్చించేందుకు టీడీపీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్థేశం చేయనున్నారు.
CM Chandrababu: నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ!
- నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం..
- టీడీపీ ఎంపీలతో భేటీ కానున్న చంద్రబాబు..
- పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఈ భేటీ..

Tdp