Site icon NTV Telugu

చిత్తూరు జిల్లాలో విషాదం.. ఏనుగుల దాడిలో ఉద్యోగి మృతి

చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మొగిలి వెంకటగిరి అటవీ ప్రాంతంలో ఏనుగుల దాడి స్థానికంగా కలకలం రేపింది. అటవీశాఖలో ఏనుగుల ట్రాకర్ సహాయకుడిగా చిన్నబ్బ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సందర్భంగా గ్రామంలో సంచరిస్తున్న 14 ఏనుగుల గుంపును తమిళనాడు అటవీప్రాంతానికి చిన్నబ్బ మళ్లిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఏనుగులు తిరగబడ్డాయి. వాటికి ఏమైందో తెలియదు కానీ… చిన్నబ్బపై దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నబ్బ మరణించాడు. కాగా మృతుడు చిన్నబ్బ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం బలిజపల్లె వాసి అని అధికారులు వెల్లడించారు.

Read Also: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. మహిళా పోలీస్ విభాగం ఏర్పాటు

కాగా ఇటీవల విజయనగరం జిల్లాలోనూ ఏనుగులు ట్రాకర్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఎలిఫెంట్ ట్రాకర్ నిమ్మక రాజబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు శ్రీకాకుళం జిల్లా గుమడ వాసిగా అటవీశాఖ అధికారులు గుర్తించారు.

Exit mobile version