విజయనగరం జిల్లా ప్రధాన జీవనాడిగా చంపావతి నది పేరు గాంచింది. చంపావతి నది తూర్పు కనుమలలో ఉద్భవించి, విజయనగరం జిల్లా గుండా తూర్పు వైపుకు ప్రవహించి, కోనాడ సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది.. ఇది ఈ ప్రాంతానికి జీవనాడి, డెంకాడ ఆనకట్ట మరియు తారకరామ తీర్థ సాగరం బ్యారేజీ వంటి బ్యారేజీలు, ఆనకట్టల ద్వారా భూమికి సాగునీరు అందిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో వ్యవసాయానికి ఈ నది ముఖ్యమైనది.
Read Also: Fake Notes: దేశంలో చెలామణి అవుతున్న నకిలీ కరెన్సీ రూ. 500 నోటు
ఈ నది శ్రీకాకుళం జిల్లాలోని ఆండ్రా గ్రామం సమీపంలో 1,200 మీటర్ల ఎత్తులో తూర్పు కనుమలలో ఉద్భవించింది.ఇది తూర్పు వైపుకు ప్రవహించి, సాలూరు, గజపతినగరం, నెల్లిమర్ల, డెంకాడ వంటి ప్రాంతాల గుండా ప్రవహించి, చివరికి విజయనగరం జిల్లాలోకి ప్రవేశిస్తుంది.నదికి నాలుగు ప్రధాన ఉపనదులు ఉన్నాయి: ఏడువంపుల గెడ్డ, చిట్ట గెడ్డ, పోతుల గెడ్డ మరియు గడి గెడ్డ. ఇది చివరకు పూసపాటిరేగ మండలంలోని కోనాడ గ్రామం సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. గజపతినగరం, నెల్లిమర్ల, సరిపల్లి, డెంకాడ, పాలెం, నటవలస వంటి కీలక ప్రాంతాల గుండా ఈ నది సాగి వేలాది ఎకరాలకు జీవనాడిగా నిలుస్తోంది.
Read Also:IIron-Rich Foods: ఐరన్ లోపంతో బాధపడుతున్నారా.. ఈ ఫుడ్స్ మీ మెనూలో చేర్చుకోండి
మొత్తం 1,410 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నదీ పరీవాహక ప్రాంతం విస్తరించి ఉంది. సరిపల్లి వద్ద నిర్మించిన డెంకాడ బ్యారేజీ ద్వారా 5,153 ఎకరాలకు, సుమారు 20.85 కిమీ ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టు నెల్లిమర్ల మండలంలో వ్యవసాయంపై ప్రభావాన్ని చూపుతూ రైతులకు ప్రధాన వరంగా నిలుస్తోంది. ప్రజల ప్రయోజనం కోసం కుమిలి నదీ పరీవాహక ప్రాంతంలో నిర్మించిన ఆనకట్ట కూడా నీటి నిల్వ, పంపిణీలో కీలక భూమిక వహిస్తోంది. జిల్లాలో చంపావతి నదికి ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవహాం చూడచక్కగా ఉంది. నెల్లిమర్ల రామతీర్థాలకు వెళ్లే దారి కోసం నెల్లిమర్ల వద్ద వంతెన నిర్మించారు. అక్కడి నీటి ప్రవాహన్ని డ్రోన్ కెమెరాతో చిత్రించారు. చంపావతి ప్రవాహం ఉరకలేస్తున్న దృశ్యాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
