NTV Telugu Site icon

రేపు అగ్రి గోల్డ్‌ బాధితులకు నగదు జమ…

రేపు అగ్రి గోల్డ్‌ బాధితులకు నగదు అందనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా బాధితుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. అగ్రి గోల్డ్‌ లో రూ. 10 వేల లోపు డిపాజిట్‌ చేసి మోసపోయిన డిపాజిటర్లను ప్రభుత్వం ఆదుకోనుంది. 3.86 లక్షల మంది డిపాజిటర్లకు 207.61 కోట్ల రూపాయలను జమ చేయనున్న సీఎం… రూ. 10 వేల నుంచి రూ. 20 వేల లోపు డిపాజిట్‌ చేసి మోసపోయిన దాదాపు 3.14 లక్షల మంది బాధితులకు అండగా నిలవనుంది. వారి ఖాతాల్లో రూ. 459.23 కోట్ల జమ చేయనున్నారు సీఎం జగన్. మొత్తం 7 లక్షల పైచిలుకు బాధితుల ఖాతాల్లో 666.84 కోట్లను జమ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.