NTV Telugu Site icon

కర్నూలులో మరో ఏటీఎం మిషన్ ధ్వంసం…

కర్నూలు ఎమ్మిగనూరులో మరో ఏటీఎం మిషన్ ధ్వంసం అయ్యింది. ఆదోని రోడ్డులో ఎస్బిఐ ఏటీఎం మిషన్ ధ్వంసం చేసారు దుండగులు. దీంతో ఇప్పటికి మొత్తం మూడు మిషన్ లను టార్గెట్ చేసారు దుండగులు. అయితే ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. అంతరం ఈ ఘటన పై ఓ నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ఘటన చోరీ కోసం చేసిన ప్రయత్నం కాదంటున్నారు పోలీసులు, ఎస్బిఐ అధికారులు. ఇది కేవలం తాగుబోతుల చర్యగా భావిస్తున్నారు అధికారులు. తర్వరలోనే వారిని అరెస్ట్ చేస్తాము అని తెలిపారు.