ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరుగుతోంది. 57 అంశాలతో కేబినెట్ అజెండా రూపొందింది. కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైఎస్సార్ చేయూత పై స్టేటస్ నివేదికను క్యాబినెట్ ఆమోదించే అవకాశం వుందని తెలుస్తోంది. గ్రేటర్ విశాఖ, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో లక్ష ఇళ్ల నిర్మాణానికి పాలనా అనుమతుల పై ఆమోద ముద్ర వేయనుంది క్యాబినెట్. నియామకాలు, ప్రమోషన్లలో డిజేబుల్ వ్యక్తులకు 4 శాతం రిజర్వేషన్ కు పచ్చజెండా ఊపనుంది మంత్రి మండలి.
సచివాలయంలో వివిధ క్యాటగిరీల్లో 85 అదనపు పోస్టుల ఏర్పాటుకు పచ్చజెండా ఊపనుంది మంత్రిమండలి. సీఆర్డీఏ చట్టంలో కొన్ని సవరణల పై చర్చించి ఆమోదించనున్న క్యాబినెట్. నాలుగు జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. నెల్లూరు, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్ ల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేయనుంది క్యాబినెట్. ఒక్కో అదాలత్ కు 10 పోస్టులను ఆమోదించనుంది మంత్రిమండలి.
Read Also: Rahul Gandhi : భారత్ జోడో యాత్ర లక్ష్యమేంటి.? రాహుల్ గాంధీ మనసులో ఉన్నదేంటి..?
కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ మినహాయింపును ర్యాటీఫై చేయనుంది కేబినెట్. తిరుపతిలో పేరూరు గ్రామంలో నోవోటల్ బ్రాండ్ కింద ఫైవ్ స్టార్ హోటల్ , ఇంటర్నేషన్ కన్వెన్షన్ సెంటర్, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేస్తుంది. ఏపీ ఛారిటబుల్ అండ్ హిందూ మత సంస్థలు, ఎండోమెంట్స్ చట్ట సవరణ బిల్లు ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. ఏపీజీసీసీఎల్ ద్వారా సోలార్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రుద్రసముద్రం గ్రామంలో 1454 ఎకరాల భూ కేటాయింపుకు ర్యాటిఫై చేయనుంది మంత్రిమండలి.
అల్లూరి సీతారామ రాజు జిల్లాలో చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపనుంది. ఏపీ టెనాన్సీ చట్టం 1956 రిపీల్ చేయటానికి డ్రాఫ్ట్ బిల్లు ప్రతిపాదనను ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడిన 24 రెవెన్యూ డివిజన్లలో 456 కొత్త పోస్టుల ఏర్పాటును ఆమోదించే అవకాశం వుంది. రెన్యూవబుల్ ఎక్స్ పోర్ట్ పాలసీ 2020లో సవరణ ప్రతిపాదనలను ఆమోదించనుంది కేబినెట్. వీటితో పాటు మరికొన్ని అంశాలను చర్చించ నుంచి మంత్రిమండలి.