AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ . 57 అంశాలతో ఎజెండా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరుగుతోంది. 57 అంశాలతో కేబినెట్ అజెండా రూపొందింది. కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైఎస్సార్ చేయూత పై స్టేటస్ నివేదికను క్యాబినెట్ ఆమోదించే అవకాశం వుందని తెలుస్తోంది. గ్రేటర్ విశాఖ, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో లక్ష ఇళ్ల నిర్మాణానికి పాలనా అనుమతుల పై ఆమోద ముద్ర వేయనుంది క్యాబినెట్. నియామకాలు, ప్రమోషన్లలో డిజేబుల్ వ్యక్తులకు 4 శాతం రిజర్వేషన్ కు పచ్చజెండా ఊపనుంది మంత్రి మండలి.
సచివాలయంలో వివిధ క్యాటగిరీల్లో 85 అదనపు పోస్టుల ఏర్పాటుకు పచ్చజెండా ఊపనుంది మంత్రిమండలి. సీఆర్డీఏ చట్టంలో కొన్ని సవరణల పై చర్చించి ఆమోదించనున్న క్యాబినెట్. నాలుగు జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. నెల్లూరు, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్ ల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేయనుంది క్యాబినెట్. ఒక్కో అదాలత్ కు 10 పోస్టులను ఆమోదించనుంది మంత్రిమండలి.
Also Read
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
Read Also: Rahul Gandhi : భారత్ జోడో యాత్ర లక్ష్యమేంటి.? రాహుల్ గాంధీ మనసులో ఉన్నదేంటి..?
కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ మినహాయింపును ర్యాటీఫై చేయనుంది కేబినెట్. తిరుపతిలో పేరూరు గ్రామంలో నోవోటల్ బ్రాండ్ కింద ఫైవ్ స్టార్ హోటల్ , ఇంటర్నేషన్ కన్వెన్షన్ సెంటర్, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేస్తుంది. ఏపీ ఛారిటబుల్ అండ్ హిందూ మత సంస్థలు, ఎండోమెంట్స్ చట్ట సవరణ బిల్లు ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. ఏపీజీసీసీఎల్ ద్వారా సోలార్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రుద్రసముద్రం గ్రామంలో 1454 ఎకరాల భూ కేటాయింపుకు ర్యాటిఫై చేయనుంది మంత్రిమండలి.
అల్లూరి సీతారామ రాజు జిల్లాలో చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపనుంది. ఏపీ టెనాన్సీ చట్టం 1956 రిపీల్ చేయటానికి డ్రాఫ్ట్ బిల్లు ప్రతిపాదనను ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడిన 24 రెవెన్యూ డివిజన్లలో 456 కొత్త పోస్టుల ఏర్పాటును ఆమోదించే అవకాశం వుంది. రెన్యూవబుల్ ఎక్స్ పోర్ట్ పాలసీ 2020లో సవరణ ప్రతిపాదనలను ఆమోదించనుంది కేబినెట్. వీటితో పాటు మరికొన్ని అంశాలను చర్చించ నుంచి మంత్రిమండలి.
తాజావార్తలు
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
ట్రెండింగ్
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!