AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ . 57 అంశాలతో ఎజెండా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరుగుతోంది. 57 అంశాలతో కేబినెట్ అజెండా రూపొందింది. కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైఎస్సార్ చేయూత పై స్టేటస్ నివేదికను క్యాబినెట్ ఆమోదించే అవకాశం వుందని తెలుస్తోంది. గ్రేటర్ విశాఖ, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో లక్ష ఇళ్ల నిర్మాణానికి పాలనా అనుమతుల పై ఆమోద ముద్ర వేయనుంది క్యాబినెట్. నియామకాలు, ప్రమోషన్లలో డిజేబుల్ వ్యక్తులకు 4 శాతం రిజర్వేషన్ కు పచ్చజెండా ఊపనుంది మంత్రి మండలి.
సచివాలయంలో వివిధ క్యాటగిరీల్లో 85 అదనపు పోస్టుల ఏర్పాటుకు పచ్చజెండా ఊపనుంది మంత్రిమండలి. సీఆర్డీఏ చట్టంలో కొన్ని సవరణల పై చర్చించి ఆమోదించనున్న క్యాబినెట్. నాలుగు జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. నెల్లూరు, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్ ల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేయనుంది క్యాబినెట్. ఒక్కో అదాలత్ కు 10 పోస్టులను ఆమోదించనుంది మంత్రిమండలి.
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
Read Also: Rahul Gandhi : భారత్ జోడో యాత్ర లక్ష్యమేంటి.? రాహుల్ గాంధీ మనసులో ఉన్నదేంటి..?
కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ మినహాయింపును ర్యాటీఫై చేయనుంది కేబినెట్. తిరుపతిలో పేరూరు గ్రామంలో నోవోటల్ బ్రాండ్ కింద ఫైవ్ స్టార్ హోటల్ , ఇంటర్నేషన్ కన్వెన్షన్ సెంటర్, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేస్తుంది. ఏపీ ఛారిటబుల్ అండ్ హిందూ మత సంస్థలు, ఎండోమెంట్స్ చట్ట సవరణ బిల్లు ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. ఏపీజీసీసీఎల్ ద్వారా సోలార్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రుద్రసముద్రం గ్రామంలో 1454 ఎకరాల భూ కేటాయింపుకు ర్యాటిఫై చేయనుంది మంత్రిమండలి.
అల్లూరి సీతారామ రాజు జిల్లాలో చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపనుంది. ఏపీ టెనాన్సీ చట్టం 1956 రిపీల్ చేయటానికి డ్రాఫ్ట్ బిల్లు ప్రతిపాదనను ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడిన 24 రెవెన్యూ డివిజన్లలో 456 కొత్త పోస్టుల ఏర్పాటును ఆమోదించే అవకాశం వుంది. రెన్యూవబుల్ ఎక్స్ పోర్ట్ పాలసీ 2020లో సవరణ ప్రతిపాదనలను ఆమోదించనుంది కేబినెట్. వీటితో పాటు మరికొన్ని అంశాలను చర్చించ నుంచి మంత్రిమండలి.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
-
Ponguleti Srinivas Reddy : హరీష్రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
-
Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
-
Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ ‘చింతపండు ఉల్లిపాయ చట్నీ’ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
-
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!