Site icon NTV Telugu

AP Cabinet: నేడే ఏపీ కేబినెట్.. పేదలకు ఇళ్ల స్థలాలపై కీలక చర్చ!

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి ఈరోజు ( ఫిబ్రవరి 24న) మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. ఈ మీటింగ్ లో సీఆర్డీయే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే, పలు సంస్థలకు భూ కేటాయింపు లపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు ఆమోదం లభించే ఛాన్స్ ఉంది. సీఆర్డీయే ప్రతిపాదనల్లో కీలక అంశంగా ఆర్ 5 జోన్.. ఈ ఆర్ 5 పేరుతో గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు.. రాజధాని అమరావతిలో R-5 జోన్ రద్దు చేస్తూ ప్రస్తుతం సీఆర్డీయే కీలక నిర్ణయం తీసుకుంది. 1,402.58 ఎకరాల భూమిని తిరిగి సీఆర్డీయేకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. R-5 జోన్ లో గత ప్రభుత్వం వేసిన లే-ఔట్లు, భూ పంపణీని రద్దు చేసిన సీఆర్డయే అథారిటీకి ఏపీ కేబినెట్ అప్పగించే ఛాన్స్ ఉంది.

Read Also: Vishwambhara: ఉగాదికి మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సరికొత్త గ్లింప్స్‌తో వస్తున్న వశిష్ట!

అలాగే, గత ప్రభుత్వ హయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సుమారు 50 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. R- 5 జోన్ తో మొత్తం రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ కు ఇబ్బందులు వస్తున్నాయి. ఈ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రలతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే, తిరుమల లడ్డు, కల్తీ పాలపై మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది.

Exit mobile version