Site icon NTV Telugu

కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!

ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. బడుగు, బలహీన వర్గాలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది ఏపీ సర్కార్. మునుపెన్నడూ లేని విధంగా సామాన్య ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చింది. అయితే తాజాగా కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు యజమానులుగా ఉన్న రైతులకు మాత్రమే అందుతున్న భరోసా.. కౌలు రైతులకు అందనుంది. ఏపీ సర్కార్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కువ శాతం భూములు కౌలు రైతుల కిందే భూములు ఉన్నాయి. అయితే వారికి హక్కు పత్రాలు లేకపోవడంతో వ్యవసాయానికి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం అందలేకపోతుంది. ఈ నేపథ్యంలో హక్కు పత్రాలను అందించేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని ఈనెల 30వ తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయించింది సర్కార్.

Exit mobile version