NTV Telugu Site icon

ఏపీలో తగ్గని కరోనా సునామీ.. 24 గంటల్లో 114 మంది మృతి

AP COVID 19

AP COVID 19

ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా సెకండ్‌వేవ్ క‌ల్లోలం సృష్టిస్తూనే ఉంది.. మొన్న త‌గ్గిన‌ట్టే త‌గ్గిన కొత్త కేసులు.. క్ర‌మంగా రెండు రోజుల నుంచి మ‌ళ్లీ పెరుగుతున్నాయి.. గ‌డిచిన 24 గంట‌ల్లో 22,610 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు కాగా… మ‌రోసారి వంద మార్క్‌ను క్రాస్ చేసిన మృతుల సంఖ్య‌.. 114 కు పెరిగింది.. ఇదే స‌మ‌యంలో 23,098 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,21,142కి చేరుకోగా.. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,09,134గా ఉంది. కోవిడ్ బారిన‌ప‌డి మృతిచెందిన‌వారి సంఖ్య 9800కు పెరిగింది. ఇక ఏపీలో మొత్తం 13,02,208 మంది ఇప్పటి వరకు కోలుకున్నారు.