Site icon NTV Telugu

Anakapalli: సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు

Ankapalli

Ankapalli

అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం సముద్రంలోకి స్నానానికి 12 మంది విద్యార్థులు దిగారు. అందులో.. తుర్ల అర్జున్, బంగా బబ్లు గల్లంతయ్యారు. మిగతా పది మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. కాగా.. గల్లంతైన వారి కోసం మెరైన్, ఎస్ రాయవరం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. గజ ఈతగాళ్ళు, స్థానిక మత్స్యకారులు సహకారంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కొరుప్రోలో ఒక వివాహానికి హాజరై ఈరోజు స్నానాల కోసమని రేవుపోలవరం సముద్రతీరానికి వచ్చారు. స్నానానికి సముద్రంలో దిగగా కెరటాలు తాకిడికి గల్లంతయ్యారు.

Exit mobile version