Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్కి శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఉపాధి హామీ నిధులు రూ.2812.98 కోట్లు మంజూరు చేసింది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో మదర్ శాంక్షన్ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల నిమిత్తం 21.5 కోట్ల పనిదినాలకుగానూ రూ.5743.90 కోట్లను మంజూరు చేసిందని.. ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.. కాగా, గతంలో ఆమోదించిన 15 కోట్ల పని దినాలకు సంబంధించి వేతన నిధులు రూ.2934.80 కోట్లు మంజూరు చేసి.. విడుదల చేసిందనీ, అదనంగా ఇప్పుడు రూ.2812.98 కోట్లను మంజూరు చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.. ఇక, ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2809.10 కోట్లు రోజువారీ వేతన ఎఫ్.టీ.ఓ.ల అప్ లోడ్ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు జమ అయ్యాయని, మిగిలిన మొత్తాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే వేతనదారుల ఖాతాలకు జమ అవుతాయని ఓ ప్రకటనలో తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్..
Pawan Kalyan: ఏపీకి గుడ్ న్యూస్.. రూ.2,812.98 కోట్లు విడుదల చేసిన కేంద్రం..
- ఆంధ్రప్రదేశ్కి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..
- ఉపాధి హామీ నిధులు రూ.2812.98 కోట్లు మంజూరు..
- వెల్లడించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
![Pawan Kalyan](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/07/Pawan-Kalyan-10-1024x576.jpg)
Pawan Kalyan