NTV Telugu Site icon

వారికి కరోనా లేదు… క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

బయోబాబులో చాలా జాగ్రత్తగా జరుగుతున్న ఐపీఎల్ 2021 లో ఈరోజు కరోనా కలకలం రేపిన విషయం తెలిసిందే.  అయితే ఈరోజు మొదట కోల్‌కత నైట్‌ రైడర్స్ జట్టులో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడినట్లు తెలిసింది. అలాగే ఆ తర్వాత  చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో  బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, సీఈవో కాశీ విశ్వనాథన్‌, చెన్నై టీమ్ బస్ క్లీనర్ కరోనా వైరస్ బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ వారికి కరోనా లేదు అని ఓ బీసీసీఐ అధికారి క్లారిటీ ఇచ్చారు. అయితే మొదట ఆదివారం చేసిన కరోనా పరీక్షలో ఈ ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తెలగా ఈరోజు చేసిన పరీక్షలో వారికి నెగెటివ్ అని వచ్చింది. దాంతో మొదట వచ్చినవి తప్పుడు రిపోర్ట్స్ అని… కాబట్టి ఆ జట్టులో ఎవరు కరోనా బడిన పడలేదని తెలిపారు ఆ బీసీసీఐ అధికారి.