భారత దేశంలో పురాతన కాలం నుంచి కొన్ని రకాల ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తుంటారు. చనిపోయిన పెద్దవాళ్లకు శ్రార్ధ కర్మలు నిర్వహిస్తుంటారు. ఈ శ్రార్ధ కర్మల్లో పిండ ప్రధానం ప్రధానమైనది. పిండప్రదానం చేయడానికి కాకులు అవసరం అవుతాయి. కానీ, పెరిగిపోతున్న నగరీకరణ, రేడియేషన్ కారణంగా కాకులు అంతరించిపోతున్నాయి. దీంతో పెద్ద పెద్ద నగరాల్లో కాకులు మచ్చుకైనా కనిపించడం లేదు. అయితే, ఢిల్లీకి చెందిన ఓ పెద్దాయన దీనిని ఉపాధిగా మార్చుకున్నాడు. రెండు కాకులను పెంచి పెద్ద చేశాడు. అవే ఇప్పుడు ఆ పెద్దాయనకు ఉపాధి కల్పిస్తున్నాయి. నగరంలో పిండ ప్రధానం చేసిన సమయంలో కాకులు అవసరం. కాకులు పిండాలను తింటూ డబ్బులు సంపాదించిపెడుతున్నాయి. కాకులకు కడుపు నిండుతోంది. ఆ పెద్దాయనకు జేబులు నిండుతున్నాయి. మహాకవి శ్రీశ్రీగారు చెప్పినట్టుగా వ్యాపారానికి కాదేది అనర్హం చెప్పండి.
ఢిల్లీలో కాకులకు కరువు… ఈ పెద్దాయనకు అదే ఉపాధి…
