Site icon NTV Telugu

కేసీఆర్ ప్రభుత్వానికి పాడె కట్టేది రైతులే : వైఎస్ ష‌ర్మిల‌

కేసీఆర్ స‌ర్కార్ పై వైఎస్ ష‌ర్మిల మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రైతులే కేసీఆర్‌.. ప్ర‌భుత్వానికి పాడే క‌డ‌తారంటూ నిప్పులు చెరిగారు ష‌ర్మిల‌. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టు, కేసీఆర్ ఈ పాపం నాది కాదని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారని చుర‌క‌లు అంటించారు. వందల మంది రైతుల చావులకు కారణమైన మీ పాపం ఊరికే పోదని…కేసీఆర్‌ రైతు హంతకులని ఫైర్ అయ్యారు.

రైతును కాటికి పంపుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి రేపు పాడె కట్టేది… మీ అధికారానికి పాతరేసేది రైతులేన‌ని హెచ్చ‌రించారు. బంగారు తెలంగాణలో అన్నం పెట్టే రైతు చావు కేకలను వినే దిక్కు లేదన్నారు.ఈ రోజు పంట పాడైతే నష్టపరిహారం అందించే దిక్కులేక,పెట్టిన పెట్టుబడి రాక, ఆదుకోవాల్సిన సర్కార్ రైతు చావులను సర్కస్ లా చూస్తుంటే, కేసీఆర్‌ ను నమ్మలేక లేక, చేసేది లేక పురుగుల మందునే నమ్ముకొని.. రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని ఆవేద‌న వ్యక్తం చేశారు ష‌ర్మిల‌.

Exit mobile version