ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది ఇష్టపడే గేమ్ ఫుట్బాల్. యూరప్, ఆఫ్రికా, అమెరికా దేశాల్లో ఈ క్రీడలకు మంచి ప్రాచుర్యం ఉన్నది. మనదేశంలో కూడా ఈ గేమ్కు ఆదరణ ఉన్నా, దానికి తగిన మౌళిక సదుపాయాలు, శిక్షణ లేకపోవడంతో కొంత వెనకబడి ఉన్నది. అయితే, కొన్ని ప్రాంతాల్లో పిల్లలు గల్లీగ్లలీల్లో ఆ ఫుట్బాల్ గేమ్ ఆడుతుంటారు. ఒడిశాలోని సబరంగ్పూర్ జిల్లాలోని సుకీగావ్ అనే గ్రామంలో పిల్లలు ఫుట్బాల్ గేమ్ అడుతుండగా పక్కనే ఉన్న అడవిలోనుంచి రెండు ఎలుగు బంట్లు వచ్చాయి. వాటిని చూసి పిల్లలు బంతిని వదిలేసి పరుగులు తీశారు. అయితే, రెండు ఎలుగుబంట్లు ఆ బంతితో వాటిలోని నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. కాళ్లతో బంతిని తుంతూ, ముందు కాళ్లతో ఎగరేస్తూ, మూతితో బంతిని పట్టుకొని పరుగులు తీశాయి. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Read: ఖైరతాబాద్ గణపతికి తొలిసారి ఇలా…!!
