యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) సినిమాను ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచానాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గ్లింప్స్ శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా.. కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ హఠాన్మరణంతో టీజర్ గ్లింప్స్ విడుదల ఆపేశారు.
టీజర్ గ్లింప్స్ రిలీజ్ పై త్వరలోనే విడుదల చేస్తామని చెప్పిన చిత్రయూనిట్ రేపు 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాపై తెలుగుతో పాటు పలు బాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు దర్శక, నిర్మాతలు సర్వం సిద్ధం చేస్తున్నారు.