Site icon NTV Telugu

ఇంట‌ర్ ఫ‌లితాల‌పై కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇంటర్‌ పరీక్షల్లో తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని.. ఇంటర్‌ ఫలితాల్లో తప్పుడు నిర్ణయాల వల్లే 23 మంది బలయ్యారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు రేవంత్ రెడ్డి. ఈ సారి జ‌రిగిన‌ ఇంటర్‌ పరీక్షల్లో నెలకొన్ని గందరగోళాన్ని సరిదిద్దాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా విద్యార్థులు క్లాస్ రూం పాఠాలకు దూరమైన విషయం తెలిసిందేన‌ని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి… ఈ నేపథ్యంలోనే ఆన్ లైన్ క్లాసుల విధానం తెర మీదకు వచ్చిందని తెలిపారు. ఆన్ లైన్ విద్యాబోధనకు మౌలిక సదుపాయాల కల్పన అన్నది అత్యంత ప్రధానమ‌ని… ఇంటర్ నెట్, కంప్యూటర్లు – లాప్ టాప్ లాంటి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంటుందని… ప్రభుత్వ – గురుకుల కళాశాలల్లో చదువు కునే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు ఇవి ఏ మేరకు అందుబాటులో ఉన్నాయన్నది ప్రశ్నార్థకమ‌మ‌న్నారు. అయితే.. ఫెయిల్ అయిన విద్యార్థుల‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Exit mobile version