Site icon NTV Telugu

తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు

తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్‌ వేడుకల పై ఆంక్షలు విధించింది కేసీఆర్ స‌ర్కార్‌. హై కోర్టు ఆదేశాలతో ఆంక్షలు విధించింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ్టి నుంచే జనవరి 2వ‌ వరకు ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్‌ సర్కార్. డిసెంబర్ 31 నుండి జనవరి 2 వరకు ర్యాలీ లు , బహిరంగ సభలు నిషేధిస్తూ… ఉత్త‌ర్వులు జారీ చేసింది ప్ర‌భుత్వం.

https://ntvtelugu.com/ap-covid19-update-on-dec-25th/


ఓమిక్రాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం… పబ్లిక్ ఈవెంట్స్ లో భౌతిక దూరం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే.. మాస్క్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిం చింది. క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో… ప్రజ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొంది.

Exit mobile version