Site icon NTV Telugu

కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు… విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు…

కేర‌ళ రాష్ట్రాన్ని వ‌ర‌ద‌లు ముంచెత్తున్నాయి. గ‌త రెండు రోజులుగా ఆ రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  ఈ వ‌ర్షాల ధాటికి వాగులు, వంక‌లు, న‌దులు ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి.  చాలా ప్రాంతాల్లో న‌దులు ప్ర‌మాద‌క‌ర‌స్థితిలో ప్ర‌వ‌హిస్తుండ‌టంతో అధికారులు లోత‌ట్టు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.  తిరువనంత‌పురం, కొట్టాయం, ప‌థనం మిట్ట‌, ఇడుక్కి జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  ఈ వ‌ర్షాల కార‌ణంగా కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి.  దీంతో అనేక ప్రాంతాల్లో రాక‌పోక‌లు నిలిచిపోయాయి.  ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్టీఆర్ఎఫ్‌, త్రివిధ ద‌ళాల సైన్యం స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మైంది.  కేంద్రం నుంచి అన్ని ర‌కాల స‌హాయ  స‌హకారాలు అందిస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.  

Read: సూర‌త్‌లో భారీ అగ్నిప్ర‌మాదం…

Exit mobile version