ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రూజ్ షిప్పుగా పేరుగాంచిన ది రాయల్ కరేబియన్ సింఫనీ ఆఫ్ సీస్ ఇప్పుడు కరోనా క్లస్టర్గా మారిపోయింది. ఈ షిప్పులో 6 వేల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుండగా అందులో ఒకరు అనారోగ్యం బారిన పడ్డారు. షిప్పులోనే ఆమెకు టెస్టులు చేయగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగింది. వెంటనే ఆమెతో కాంటాక్ట్లో ఉన్న వారికి టెస్టులు నిర్వహించారు.
Read: వైరల్: రోడ్డుపై డబ్బులు విసిరేసిన బిచ్చగాడు… షాకైన ప్రజలు…
మొత్తం 48 మందికి పాజిటివ్గా నిర్ధారణ జరగడంతో షిప్పులు ఫ్లోరిడాలోని మియామీ బీచ్లో నిలిపివేశారు. రాయల్ కరేబియన్ సింఫనీ ఆఫ్ సీస్ కరోనా క్లస్టర్గా మారింది. ఈ శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. వీరికి సోకింది కరోనా పాజిటివ్నా లేక ఒమిక్రాన్ వేరియంటా అన్నది తెలియాల్సి ఉంది. కరోనా సోకిన 48 మందికి షిప్పులోనే ఐసోలేషన్లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
