నేడు కామారెడ్డి జిల్లాలో రెండో రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు. ఇవాళ బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు. బిక్నూర్ లో రేషన్ షాపును నిర్మలా సీతారామన్ సందర్శించనున్నారు. కోటగిరి PHC లో వ్యాక్సినేషన్ సెంటర్ ని సందర్శిస్తారు.
నిన్న నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ. 38,500 కోట్లతో ప్రారంభమై అదనంగా లక్షా 25 వేల కోట్లకు పెంచారని విమర్శించారు. తెలంగాణ అప్పుల గురించి అడగటానికి కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో అప్పుడే పుట్టిన భాబు కూడా లక్ష రూపాయల అప్పు కట్టాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
నేను తెలంగాణ ప్రజల కోసం నమస్కరిస్తున్నానని.. కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రతీ ఒక్కటీ అమల్లోకి రావాలని అని అన్నారు. అప్పులపై ఓపికగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానికి ఉందని అన్నారు. నేనే కేంద్ర మంత్రి అన్నట్లుగా సీఎం కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారని.. లాభాల్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారని విమర్శించారు. ఉపాధి హామీ పథకం కింద రూ. 20 వేల కోట్లు ఇచ్చాము.. ఉపాధి హామీ పథకం సర్వే కోసం అధికారులు వచ్చారు.. మేము పంపిన డబ్బులు ఖర్చు చేయకపోతే అధికారులు విచారణ చేస్తారని ఆమె అన్నారు.
Bihar: చెవి నొప్పి ఉందని ఆసుపత్రికి వెళ్తే.. చేయి కోల్పోయింది..
