NTV Telugu Site icon

TSPSC: పేపర్ లీకేజీ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. సిట్ అదుపులో మరో 15 మంది..

Tspsc

Tspsc

Tspsc paper leak case: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పేపర్ లీక్ ఘటనపై నిరుద్యోగులతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు అధికార ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముందుగా ఈ పేపర్ లీకేజీ ఉదంతం వెలుగులోకి రాగానే అందులో పాల్గొన్న వారందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన దంపతులు తమ సిమ్ కార్డులు తీసుకుని పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. ఆ తర్వాత పోలీసులకు పట్టుబడి ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పుడు పట్టుబడతామంటూ హడావుడి చేసిన నిందితులు.. తప్పించుకోలేరనే ఉద్దేశ్యంతో తప్పు చేశారంటూ ఇప్పుడు సిట్ ఎదుట లొంగిపోయే పరిస్థితి నెలకొంది.

Read also: Health Tips : షుగర్ ఉన్న గర్భిణీలు వీటిని ఎట్టిపరిస్థితుల్లో తినకండి.. డేంజర్..

అయితే.. 20 రోజుల వ్యవధిలో 15 మంది తమ నేరాన్ని అంగీకరించారని సిట్ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 90 మంది నిందితులను అరెస్టు చేయగా.. నెలాఖరులోగా మరో పది మందిని అరెస్టు చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది మార్చి నెలలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ అయినట్లు బేగంబజార్ పోలీసులకు సమాచారం అందింది. గతంలో 12 మందిని అరెస్టు చేశారు. ఆ తర్వాత కమిషన్ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిని సూత్రధారిగా నియమించారు. నెట్‌వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి సహకారంతో పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు. కమీషన్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్ చార్జి శంకరలక్ష్మి డైరీలోని ఐడీ, పాస్ వర్డ్ ను దొంగిలించినట్లు పోలీసుల విచారణలో ప్రవీణ్ కుమార్ తెలిపాడు. అయితే దీనికి సంబంధించిన వివరాలేవీ ఆమె డైరీలో కనిపించలేదు. నిందితుల ఫోన్, ల్యాప్‌టాప్, హార్డ్ డిస్క్‌లు కేసుకు దారితీసే అవకాశం ఉందని సిట్ అధికారులు తెలిపారు.
Lectrix EV Scooter Launch: ఎథర్‌, ఓలాకు పోటీగా.. మార్కెట్‌లోకి సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌!