Site icon NTV Telugu

సినిమా థియేటర్ల టిక్కెట్ల ధరల పై టీఎస్ హైకోర్టులో విచారణ

తెలంగాణలో సినిమా థియేటర్లలో టిక్కెట్లు ధరల పై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ చేశారని ప్రశ్నించింది హైకోర్టు. అయితే టికెట్ల ధరలు నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు హైకోర్టు తెలిపారు ప్రభుత్వ తరపు న్యాయవాది. ఆ కమిటీ సూచనలు ప్రభుత్వానికి నివేదించినట్లు కోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరుపు న్యాయవాది. కమిటీ నివేదికపై నాలుగు వారాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని హైకోర్టు పేర్కొంది. ఇక కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ , హోం శాఖ సెక్రెటరీలకు హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Exit mobile version