NTV Telugu Site icon

జడ్చర్ల… కొత్తూరులో కారు జోరు… 

తెలంగాణలో ఐదు మున్సిపాలిటీలకు, రెండు కార్పొరేషన్లకు ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ వస్తున్నాయి.  మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీని తెరాస పార్టీ కైవసం చేసుకుంది.  మొత్తం 27 వార్డులు ఉండగా, 19 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తయింది.  ఇందులో 16 వార్డులను తెరాస పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.  


ఇక ఇదిలా ఉంటె రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీని కూడా తెరాస పార్టీ కైవసం చేసుకుంది.  మొత్తం 12 వార్డులు ఉండగా అందులో ఏడు వార్డుల్లో తెరాస పార్టీ విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ ఐదు వార్డుల్లో విజయం సాధించింది.