నేడు నిర్మల్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి…

revanth reddy

నేడు నిర్మల్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రానున్నారు. టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ మొదటి జిల్లా పర్యటన ఇది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్ లో ఎడ్ల బండ్లు, సైకిల్ ర్యాలీ లో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యా వసర ధరల పెరుగుదలకు నిరసనలు చేస్తున్నారు. ఆదిలాబాద్ లో కు కొండా సురేఖ, మంచిర్యాల కు సిరిసిల్ల రాజయ్య, కొమురం భీం జిల్లా లో అన్వేష్ రెడ్డి పర్యటనలు చేయనున్నారు. జిల్లా కేంద్రాలలో ఎడ్ల బండ్ల ప్రదర్శన, సైకిల్ ర్యాలీ ల తో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నారు.