Site icon NTV Telugu

తెలంగాణ కరోనా అప్డేట్…

corona

corona

తెలంగాణలో గత బులెటిన్‌తో పోలిస్తే.. ఇవాళ పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 167 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్క కరోనా బాధితుడు ప్రాణాలు కోల్పోయారు. ఇక, 207 మంది ఇదే సమయంలో పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,71,790 నమోదు కాగా.. మృతుల సంఖ్య 3,959కు పెరిగింది.. ఇక, రికవరీ కేసులు 6,63,898 చేరుకున్నాయి… ప్రస్తుతం రాష్ట్రంలో 3,933 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. గత 24 గంటల్లో 37,941 శాంపిల్స్‌ పరీక్షించామని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. తాజా కేసులో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 66 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి.

Exit mobile version