DSC Results 2024: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ నిర్వహించిన ‘టీజీ డీఎస్సీ-2024’ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు సచివాలయంలో డీఎస్సీ పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి, నామా, కొండ సురేఖ, సీఎస్.. విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. అభ్యర్థులు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్ష రాశారు.
DSC Results 2024: ‘టీజీ డీఎస్సీ-2024’ పరీక్ష ఫలితాలు విడుదల
- 'టీజీ డీఎస్సీ-2024' పరీక్ష ఫలితాలు..
- సచివాలయంలో డీఎస్సీ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి..