Site icon NTV Telugu

సీఎం కేసీఆర్‌పై సర్వే సత్యనారాయణ ప్రశంసలు

దళిత బంధు పథకంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన దళిత బంధు ఎంతో గొప్ప పథకమని కితాబిచ్చారు. ఈ పథకాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు. పథకం అమలుతో దళితుల జీవితాలు పూర్తిగా మారిపోతాయనడంలో ఎలాంటి సందేహంలేదని పేర్కొన్నారు. దళిత బంధు అమలులో సీఎం కేసీఆర్‌ నిర్ణయాలకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.

Read: పుష్ప : “దాక్కో దాక్కో మేక” సాంగ్ వచ్చేసింది !

హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. దళిత బంధు విషయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్ని పార్టీలకు హితవుపలికారు.దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయానికి రాజకీయాలకు అతీతంగా మద్దతు పలకాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఈ పథకాన్ని పారదర్శకంగా అమలుచేస్తూ.. ప్రతి దళిత కుటుంబానికి న్యాయంజరిగేలా చూడాలని కోరారు.

Exit mobile version