Rain Effect : అకాల వర్షం.. రైతులు ఆగమాగం..

  • ఎండల మధ్య అకస్మాత్తుగా వర్షం.. రైతులకు భారీ నష్టం
  • మార్కెట్ యార్డులో తడిసిన మొక్కజొన్న, వరి ధాన్యం
  • తేమ పేరుతో కొనుగోళ్లు నిలిపివేతపై రైతుల ఆవేదన
  • తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
Rain

Rain

Rain Effect : అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు రైతులను నిండా మంచుతున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈదురు గాలులతో కురిసిన మోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్ర ఎండ ప్రభావం ఉండగా మధ్యాహ్న సమయంలో వాతావరణం చల్లబడి ఆకస్మాత్తుగా మోస్తారు వర్షం పడింది. వర్షం దాటికి హుస్నాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి రైతులు ఆరబోసిన మొక్కజొన్నలు, వరి ధాన్యం తడిసిపోయింది. మొక్కజొన్న, వరి ధాన్యానికి టార్పాలిన్ కవర్లు కప్పేలోపే వర్షం జోరుగా కురిసి ధాన్యం తడిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి మొక్కజొన్న, వరి ధాన్యం తీసుకువచ్చి 15 రోజులు దాటుతున్న తేమ పేరుతో కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు.