NTV Telugu Site icon

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న నేచురల్ స్టార్

టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగిపోతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. తాజాగా శ్యామ్ సింగరాయ్ మూవీ యూనిట్ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొంది. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్ నగర్‌లో ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కులో నేచురల్ స్టార్ హీరో నాని, హీరోయిన్లు సాయి పల్లవి, కృతిశెట్టి, నిర్మాత బోయినపల్లి వెంకట్ మొక్కలు నాటారు.

Read Also:

అనంతరం నేచురల్ స్టార్ నాని మీడియాతో మాట్లాడాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మనందరి బాధ్యత అని పేర్కొన్నాడు. గ్లోబల్ వార్మింగ్ అరికట్టడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని నాని అభిప్రాయపడ్డాడు. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చాడు.