NTV Telugu Site icon

షేక్ పెట్ తహశీల్దార్ సంతకం ఫోర్జరీ…

షేక్ పెట్ తహశీల్దార్ సంతకం ఫోర్జరీ చేసారు. రోడ్ నెంబర్ 10లో 6 కోట్లు విలువ జేసే భూమి వ్యవరహంలో తహశీల్దార్ సంతకం ఫోర్జరీ చేసారు. ప్రభుత్వ భూమికి ఎన్ వోసి ఇచ్చరంటు తహశీల్దార్ సంతకం ఫోర్జరీ చేసాడు అసదుల్ల పాషా. తన భూమిలో ఏర్పాటు చేసిన బోర్డ్ లను అన్యాయంగా తీసేసరంటు హైకోర్టు ను ఆశ్రయించారు అసదుల్ల పాషా. కోర్ట్ కు సమర్పించిన అఫిడవిట్ లో నకిలీ పత్రాలు జత చేసిన అసదుల్ల… షేక్ పెట్ తహశీల్దార్ నుండి ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వకున్నా ఎన్ వోసి క్రియేట్ చేసి కోర్ట్ కు సమర్పించారు. తన సంతకం ఫోర్జరీ చేశారని తెలుసుకున్న షేక్ పెట్ తహశీల్దార్… బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.