ఇటీవల కాలంలో రైల్వే స్టేషన్లలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కదులుతున్న ట్రైన్స్ ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు ప్రయాణికులు అదుపుతప్పి పడిపోవడం.. లేదా ప్లాట్ఫాం పై నుంచి పట్టాలపై పడిపోవడం లాంటి ఘటనలు రైల్వే స్టేషన్లలో చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు వచ్చినప్పుడు ఆ రైల్వే స్టేషన్లలో పనిచేసే పోలీసులు ప్రయాణికుల్ని రక్షించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా బేగంపేట్ రైల్వే స్టేషన్లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువతిని రైలు కింద పడిపోకుండా ఓ మహిళ కానిస్టేబుల్ రక్షించింది.
Read Also: Fresh Mutton: మీరు కొంటున్న మటన్ తాజాదేనా.?
నిన్న (మంగళవారం) ఉదయం 9 గంటలకు లింగంపల్లి-ఫలక్నూమా ఎంఎంటీఎస్ రైలు బేగంపేట్ రైల్వే స్టేషన్కు వచ్చింది. అయితే ఆ ట్రైన్ కొద్దిసేపు ఆపి ముందుకు వేగాన్ని వెళ్లింది. ఈ క్రమంలో సరస్వతి అనే ఓ ప్రయాణికురాలు ఆ కదులుతున్న రైలు ఎక్కేందుకు ట్రై చేసింది.. అదే సమయంలో అక్కడ డ్యూటీ చేస్తున్నా.. సనిత అనే రైల్వే ప్రొటెక్క్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ ఆమెను గుర్తించింది. వెంటనే పరిగెత్తుకెళ్లి ఆ ప్రయాణికురాలిని పట్టుకుని వెనక్కి లాగింది. ఒకవేళ మహిళ కానిస్టేబుల్ సనిత అక్కడికి రాకపోయి ఉంటే ఆ ప్రయాణికురాలు ( సరస్వతి ) ట్రైన్ కింద పడిపోయే ప్రమాదం ఉండేంది. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
Read Also: New Rules: జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇవి పూర్తి చేశారా లేదంటే అంతే..!
ఆ ప్రయాణికురాలిని రక్షించడంపై అధికారులు కానిస్టేబుల్ సనితను ప్రశంసిస్తున్నారు. ప్రయాణికుల సామాగ్రి కనబడకపోయిన లేదా అనుకోకుండా వదిలేసి వెళ్లిపోయిన వారికి వాటిని తిరిగి ఇచ్చేలా సనిత చర్యలు తీసుకునేదని రైల్వే అధికారులు వెల్లడించారు. నల్గొండ జిల్లాకు చెందిన సనిత 2020లో ఆర్పీఫ్లో చేరిందని ఆ తర్వాత బేగంపేట్ రైల్వే స్టేషన్లో డ్యూటీ నిర్వహిస్తుందని వెల్లడించారు.